చిక్కబళాపుర, 10 జూలై (హి.స.)ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదిక కీలక ట్వీ్ట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున, మీ అంతర్గత శ్రేయస్సు కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, మీ మనస్సును ఒక అద్భుతం చేయండి.. మీ గురువు అనుగ్రహం మీతో ఉంటుంది.. అంటూ సద్గురు ట్వీట్ చేశారు. గురు పూర్ణిమ సత్సంగం ముగిసిన వెంటనే సద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమం జరగనుంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9:15 గంటల వరకు లైవ్ స్ట్రీమ్లో వీక్షించవచ్చు.. అలాగే.. మీరు కూడా గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొనవచ్చు.. ధ్యానం చేయవచ్చు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి