అమరావతి, 13 జూలై (హి.స.)
:మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై )విజయవాడలోఇవాళ(ఆదివారం)మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనార్టీ నాయకులుఫతావుల్లా, ఆషాలు.. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావాలనిమైనార్టీ నేతలుకోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగా చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పేర్ని నానిని కొడతామనిఫతావుల్లా, ఆషాలుహెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలుపేర్ని నానిమాట్లాడకుండా గుణపాఠం చెబుతామనిమైనార్టీ నేతలువార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ