అమరావతి, 15 జూలై (హి.స.)
: రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ) హైకోర్టులో () పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈరోజు ఆ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న ధర్మాసనం.. మిథున్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ