హైదరాబాద్, 8 జూలై (హి.స.)
మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 2025, జూలై 8న హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రైడ్స్ చేసి టాక్స్ ఆఫీసర్ సుధాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం గగన్ విహార్లో తనిఖీలు చేశారు. నిందితురాలు సుధాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్