అమరావతి, 8 జూలై (హి.స.)
శ్రీశైలం: ఏపీ సీఎం చంద్రబాబ) శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం.. జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ