అమరావతి, 8 జూలై (హి.స.)
:అమరావతిలోమరో ఆరునెలల్లోనేక్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్()స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. ఇవాళ(మంగళవారం) జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీల్లో శరవేగంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారుమంత్రి నారా లోకేష్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ