
అమరావతి, 20 జనవరి (హి.స.)
,గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్ట్లపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రేట్ గ్రీన్ వాల్ 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కి.మీ తీరప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్గా ఏర్పడి ప్రధాన పర్యావరణ ప్రాజెక్ట్గా రూపాంతరం చెందాలని పవన్ ఆదేశించారు. ఇది తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి ‘జీవన పర్యావరణ కవచం’ను ఏర్పరుస్తుందని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ