1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు: మాజీ ఎంపీకి ఊరట
ఢిల్లీ,22, జనవరి (హి.స.) నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు(1984)కు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి గురువారం ఉపశమనం లభించింది. దేశ రాజధానిలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో అల్లర్లను రె
Supreme Court


ఢిల్లీ,22, జనవరి (హి.స.) నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు(1984)కు సంబంధించిన ఒక కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి గురువారం ఉపశమనం లభించింది. దేశ రాజధానిలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో అల్లర్లను రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జన్ కుమార్‌ను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన దరిమిలా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్.. సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి స్థాయి, లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. న్యాయమూర్తి వెల్లడించిన కారణాలు, తీర్పులోని ఇతర అంశాలు ఆ ఆర్డర్ కాపీలో స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande