
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.): బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర ) తండ్రి సునీల్ మల్హోత్ర కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 14న ఆయన మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తండ్రిని తలచుకుంటూ సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ఖరారైంది. ‘‘నిజాయతీ, విలువలతో జీవించారు. క్రమశిక్షణకు మారుపేరు. కాలం ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టినప్పటికీ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు. ధైర్యంగా అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారు. స్ట్రోక్ ఆయనను వీల్ఛైర్కు పరిమితం చేసినప్పటికీ భయపడలేదు. చివరకు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు’’ అని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు.
తాను ఈ స్థానంలో ఉండడానికే కారణం తన తండ్రే కారణం అని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు. ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయన్నారు. 2023 ఫిబ్రవరి 7న సిద్ధార్థ్.. కియారాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ