
ఢిల్లి, 22 ఫిబ్రవరి (హి.స.)
భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో మొట్టమొదటి రోడ్డు, రైలు సొరంగం బ్రహ్మపుత్ర నది కింద నిర్మించనున్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ రోడ్డు, రైలు మార్గాన్ని నీటి అడుగున ఏర్పాటు చేయనుంది.
నీటి అడుగున రైలు-రోడ్డు సొరంగం:
- అస్సాంలోని గోహ్పూర్-నుమాలిఘర్ మధ్య.
- పొడవు: 15.8 కి.మీ.లేన్
- ప్రాజెక్టు వ్యయం: 4 లేన్ల సొరంగంప్రాజెక్టు వ్యయం – 18,662 కోట్లు
- సమయం: నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాలు
6 గంటల దూరాన్ని నిమిషాల్లో ప్రయాణం:
జాతీయ రహదారి 715 లోని నుమాలిఘర్- NH-15 లోని గోహ్పూర్ మధ్య దూరం ప్రస్తుతం దాదాపు 240 కిలోమీటర్లు. సిలిఘాట్ సమీపంలోని కాలియాభంభోరా రోడ్డు వంతెన ద్వారా ప్రయాణించడానికి దాదాపు ఆరు గంటలు పడుతుంది. ఈ మార్గంలో వాహనాలు కాజీరంగ జాతీయ ఉద్యానవనం, విశ్వనాథ్ పట్టణం గుండా వెళ్ళవలసి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ కింద 15 కిలోమీటర్ల సొరంగం ఈ ప్రయాణాన్ని తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. గంటల పాటు ప్రయాణించే బదులు నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేసుకోవచ్చంటున్నారు అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV