
అమరావతి, 13 మార్చి (హి.స.)
అమరావతి, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్గా ఉండబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు సైతం ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేశ్కు వారు వివరించారు. శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో ఆయనతో బిట్స్ పిలానీ ప్రతినిధులు సమావేశమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ