
ముంబై, 13 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్
బలోపేతం అవుతుండటంతో భారత రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ (Intraday Trading)లో 12 పైసలు పతనం అవ్వడంతో చరిత్రలో తొలిసారిగా డాలర్తో పోలిస్తే చూపింది. రూ.92.37 మార్కును తాకింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ నష్టాల్లో కొనసాగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు (Foreign investors) తమ నిధులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై తీవ్ర ప్రభావం అదేవిధంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు కూడా డాలర్ మరింత బలపడడానికి ఇంపాక్ట్ చూపించాయి.
రూపాయి విలువ పడిపోవడం వల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగనున్నాయి. ముఖ్యంగా ముడిచమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగి, దేశీయంగా ద్రవ్యోల్బణం (Inflation) కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్యుడి జేబుపై అదనపు భారం పడేలా చేస్తుంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..