
అమరావతి, 14 మార్చి (హి.స.)అమరావతి: గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉదయం 11.30 గంటలకు గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని సీఎం సూచించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని సమస్య లేకుండా ప్రయత్నం చేయాలని ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి.. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ