కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడులు
ఢిల్లీ.,30 జనవరి (హి.స.)పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఇతర గల్ఫ్ దేశాలకు పెను శాపంగా మారింది. కువైట్లోని ఒక కీలక విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్పై ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. క
కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడులు


ఢిల్లీ.,30 జనవరి (హి.స.)పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఇతర గల్ఫ్ దేశాలకు పెను శాపంగా మారింది. కువైట్లోని ఒక కీలక విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్పై ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు.

కువైట్లోని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రధాన ప్లాంట్లోని సర్వీస్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారతీయ పౌరుడు (టెక్నీషియన్ అని తెలుస్తోంది) మరణించగా, మరికొంతమంది గాయపడినట్లు సమాచారం. డ్రోన్ నేరుగా భవనాన్ని ఢీకొనడంతో కంట్రోల్ రూం తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అమెరికా తన యుద్ధనౌకలు, సైనిక బలగాలను గల్ఫ్ దేశాలలోని స్థావరాల నుంచి ఇరాన్పై దాడులకు ఉపయోగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

అమెరికాకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక మూలాలను.. ముఖ్యంగా విద్యుత్, నీటి ప్లాంట్లపై దాడులు చేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య కాకుండా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలకు విస్తరిస్తోం

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande