అమర్నాథ్ యాత్రకు ముహుర్తం ఫిక్స్.. జూన్ 29న తొలి పూజ..
అమర్నాథ్ యాత్రకుషెడ్యూల్ ఖరారైంది. జూన్ 29న తొలి పూజ జరగనుంది
Amarnath


జమ్ము కాశ్మీర్, 12 ఏప్రిల్ (హి.స.)

అమర్నాథ్ యాత్రకుషెడ్యూల్ ఖరారైంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో గల అమర్నాథ్ యాత్ర జూలై మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగియనుంది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారిక ప్రకటన చేశారు.

శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహించనున్నారు. ఇక ఈ అమర్నాథ్ యాత్ర కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 3882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు 13 ఏళ్లు పైబడిన వాళ్లను మాత్రమే అనుమతి ఇస్తారు. అటు 70 సంవత్సరాలు దాటిన వారికి పర్మిషన్ లేదన్న సంగతి తెలిసిందే.

ఇండియా వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్, జమ్మూ కాశ్మీర్ బ్యాంకులకు ఉన్న శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఇలా మొత్తం 554 గుర్తింపు పొందిన శాఖల ద్వారా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అమర్నాథ్ బోర్డు నిబంధనల ప్రకారం 13 - 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ యాత్రకు అర్హులవుతారు. యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరు హెల్త్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande