
తిరుమల , 28 ఏప్రిల్ (హి.స.)ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan) ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu), ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణణ్కు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ మేరకు
దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బేడీ ఆంజనేయస్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV