
మహ్మదాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ప్రజలకు పురుగుల పట్టి న రేషన్ బియ్యం ఇచ్చి ప్రజా ఆగ్రహానికి గురువుతున్నారు. మండలంలోని చౌదర్పల్లి రేషన్ షాపునకు శుక్రవారం 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం వచ్చాయి. శనివారం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడానికి సంచులు తీయగా అందులో పురుగులు, నూకలే కనిపిస్తున్నాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు..
అం దులో పురుగులు ఉంటే ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. 35 కిలోల రేషన్ బియ్యంలో 10కిలోల నూకలు ఉంటున్నాయని ప్రజలు ఆరోపించారు. ఇలాంటి బియ్యం పశువులు కూడా తినలేవని ప్రజలు ఎలా తింటారని కొందరు బియ్యం తీసుకోకుండానే తిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో కొంతమంది అలాగే తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు. పాత స్టాక్ సంచులను పంపించడం వల్లే ఇలా పురుగులు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూడు నెలలు పురుగుల బియ్యం తినలేక ఆకలితో చావాలా అంటూ కొంతమంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi