
చెన్నై, 15 మే (హి.స.)
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. కేవలం సమాజాన్ని అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పెరియార్, అంబేద్కర్, అన్నాదురై వంటి మహనీయుల ఆశయాలనే తాను అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని, అణచివేత లేని సామాజిక న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
2026 ఎన్నికల తర్వాత డీఎంకే ప్రతిపక్షంలోకి రావడంతో, ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సీఎం విజయ్ సమక్షంలోనే ఉదయనిధి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉదయనిధి వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని, ఇది విభజన రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ తీవ్రంగా మండిపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi