
ధర్మశాల, 17 మే (హి.స.)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL
2026)లో భాగంగా ఇవాళ ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో ఆర్సీబీ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే, ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడంతో, వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.
ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న పంజాబ్ కింగ్స్ టాప్-2 రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 37 సార్లు తలపడగా.. పంజాబ్ 18 మ్యాచ్ల్లో, బెంగళూరు 19 మ్యాచ్లో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య రికార్డులు దాదాపు సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారనుంది. ధర్మశాల పిచ్ సాధారణంగా గేమ్ లకు హై-స్కోరింగ్ అనుకూలిస్తుండటంతో, విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు సాధించాలని పట్టుదలగా ఉంది. అలాగే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు