
రాజన్న సిరిసిల్ల, 13 జూన్ (హి.స.)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కారులో నుంచి దిగిన బండి సంజయ్ అక్కడ ఎస్పీ మహేష్ గీతే కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎస్పీకి మా కార్యకర్తలంటే ఎందుకు అంత కోపం, మా వాళ్లతో బస్కీలు తీపిస్తాడా..? వాళ్లు కార్యకర్తలు అనుకుంటున్నాడా.. ఏమనుకుంటున్నాడు.. బీఆర్ఎస్ అంటే ఎందుకంత ప్రేమ ఆయనకు అంటూ డీఎస్పీపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశాడు. కేటీఆర్ పై ప్రేమ ఉంటే వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో చేరమను అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశ మయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..