మోకాళ్ల లోతు బురద నీళ్లలో కూర్చుని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నిరసన
మోకాళ్ల లోతు బురద నీళ్లలో కూర్చుని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నిరసన
మోకాళ్ల లోతు బురద నీళ్లలో కూర్చుని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నిరసన


నిజామాబాద్ : 21 జూన్ (హి.స.)

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినూత్న నిరసనకు దిగారు. నిజామాబాద్ జ్లి బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిచ్కుంద అభివృద్ధి కుంటుపడుతున్నదని, అభివృద్ధి పనులు లేక అవస్థలు ఎదురవుతున్నాయని హనుమంత్ షిండే అన్నారు. చిన్నపాటి వర్షానికి మోకాలు లోతు నిలిచిన బురద నీళ్లలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande