ఆర్టికల్ 370 రద్దుతో నెరవేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల: అమిత్ షా
హైదరాబాద్, 23 జూన్ (హి.స.) భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా, 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్ప
shyam


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా, 2019లో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలను మరియు ఆయన ఆశయాలను నిజం చేసిందని స్పష్టం చేశారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు (ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్) నడవవు అంటూ కాశ్మీర్ పూర్తి విలీనం కోసం ముఖర్జీ అప్పట్లో చారిత్రాత్మక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రతిపాదనలను నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ మొదటి క్యాబినెట్ నుండి ముఖర్జీ తన పరిశ్రమల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు.ఆ కాలంలో కాశ్మీర్లోకి ప్రవేశించడానికి ఉన్న పర్మిట్ విధానాన్ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని, కాశ్మీర్ నా దేశంలో భాగం, అక్కడికి వెళ్లడానికి నాకు ఎలాంటి పర్మిట్ అవసరం లేదు అని నినదించారని అమిత్ షా పేర్కొన్నారు. అనంతరం పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించి కాశ్మీర్ సరిహద్దు దాటినందుకు ఆయనను అక్కడ అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ తర్వాతే ఆయన జైలులో మరణించారని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande