
అయోధ్య, 23 జూన్ (హి.స.)
అయోధ్య రామమందిరం విరాళాల నిధుల అక్రమాల వివాదంప AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన ఆయన, బిలియన్ల కొద్దీ ప్రజల విరాళాలు 'చోరీకి' గురయ్యాయని ఆరోపించారు. నగదు, బంగారు ఆభరణాల దొంగతనానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ చంపత్ రాయ్ను ఇంకా అదే పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారని సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా కేజ్రీవాల్ ప్రశ్నించారు. రామమందిరం నుండి దాదాపు ₹200 కోట్ల నగదుతో పాటు ఆభరణాలు ఉన్న పలు పెట్టెలు దొంగిలించబడ్డాయని, ఈ ఘటనతో రాముని భక్తులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల ఉదాసీనతను నిలదీస్తూ, ఆలయ సంపూర్ణ నిర్వహణ బాధ్యతలు చంపత్ రాయ్ చేతుల్లోనే ఉన్నాయని, ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. చంపత్ రాయ్కు సాక్ష్యాలను నాశనం చేయడానికి లేదా సాక్షులను బెదిరించడానికి సమయం ఇస్తున్నారా? ఆయనను ఎవరు కాపాడుతున్నారు? అని కేజ్రీవాల్ నిలదీశారు. ఒకవేళ చంపత్ రాయ్ నోరు విప్పితే ఎక్కడ పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే ఆయనను పదవి నుంచి తొలగించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మరోవైపు, ఈ విరాళాల అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని, అలాగే విరాళాల రిజిస్టర్లు, సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi