అయోధ్య విరాళాల రగడ.. చంపత్ రాయ్కు వీహెచ్పీ మద్దతు
అయోధ్య విరాళాల రగడ.. చంపత్ రాయ్కు వీహెచ్పీ మద్దతు
Seoni: On August 21, a special train will leave from Seoni railway station for Ayodhya Dham


అయోధ్య , 29 జూన్ (హి.స.)

అయోధ్య రామమందిరానికి అందిన విరాళాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్ గట్టిగా మద్దతు పలికారు. అంతేకాదు, రాయ్ రాజీనామాను డిమాండ్ చేసిన రాజకీయ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన నగదు, ఆభరణాలు, వెండి ఇటుకలు వంటి విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో, నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంపై సోమవారం మాట్లాడిన అలోక్ కుమార్, ఈ వ్యవహారంలో పారదర్శకమైన, నిష్పాక్షికమైన విచారణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రస్ట్ తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే ట్రస్ట్ వెంటనే ప్రాథమిక విచారణ జరిపి, దోషులను గుర్తించి, రూ. 80 లక్షలు రికవరీ చేసింది. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదిక ఆధారంగా 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అని అలోక్ కుమార్ వివరించారు. విచారణకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే చంపత్ రాయ్తో పాటు మరో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా స్వచ్ఛందంగా తమ పదవుల నుంచి తప్పుకున్నారని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా, చంపత్ రాయ్ రాజీనామా కోరిన నేతల తీరును అలోక్ కుమార్ తప్పుబట్టారు. గతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఎందరో నేతలు పదవుల్లోనే కొనసాగారని ఆయన గుర్తుచేశారు.

అరెస్ట్ అయినప్పటికీ కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా కొనసాగాలని పట్టుబట్టారు. జేఎంఎం ఎంపీల కొనుగోలు కేసులో మాజీ ప్రధాని నరసింహారావుపై, బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీపై ఆరోపణలు వచ్చినా వారెవరూ రాజీనామా చేయలేదు అని విమర్శించారు. ఆప్, కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రవర్తనకు, చంపత్ రాయ్ నైతిక ప్రవర్తనకు మధ్య ఉన్న తేడా ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande