జగన్నాథుని ఆశీస్సులతో దేశమంతా సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్
జగన్నాథుని ఆశీస్సులతో దేశమంతా సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్
pawan


హైదరాబాద్, 16 జూలై (హి.స.)

పవిత్రమైన పూరీ జగన్నాథుని రథయాత్రను

పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని

పవన్ కల్యాణ్ భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్నాథుని

ఆశీస్సులతో దేశమంతా సుభిక్షంగా, శాంతిసంతోషాలతో విలసిల్లాలని ఆయన

ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ఒక భక్తిపూర్వక సందేశాన్ని

పంచుకున్నారు.

పవిత్రమైన ఈ రథయాత్ర అనేది కేవలం ఒక

ఉత్సవం మాత్రమే కాదని.. అది అచంచలమైన విశ్వాసానికి, భక్తికి,

అలాగే భగవంతునికి, భక్తుడికి మధ్య ఉండే శాశ్వతమైన

ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీక అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. పవిత్ర రథాలపై

స్వామివారు, అమ్మవారు ముందుకు సాగుతుండగా... ఆ

జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిల

దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి హృదయానికి శాంతిని, ప్రతి

కుటుంబానికి మానసిక బలాన్ని, ప్రతి జీవితానికి సరికొత్త ఆశను

ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆ కలియుగ దైవం మనందరినీ ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడిపించి, మన ఇళ్లను సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో

నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దీనితో పాటు, సమాజానికి

వినమ్రతతో, నిష్కల్మషమైన భక్తితో సేవ చేసేలా..

మనందరికీ అవసరమైన జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఆ స్వామి ప్రసాదించాలని

కోరారు. ఈ పవిత్రమైన రోజున జగన్నాథుని దివ్య అనుగ్రహం మన జీవితాల్లో సరికొత్త

వెలుగులు నింపి, శాంతి, ఐక్యత,

ఆధ్యాత్మిక బలంతో కూడిన ఒక ఉన్నతమైన భవిష్యత్తు వైపు మన సమాజాన్ని

నడిపించాలని ఆకాంక్షించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande