తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
chandra babu


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, 'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్' సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్ధం చేసిన 500 నూతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను సీఎం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా తల్లీబిడ్డల అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో చేసిన మార్పులను అధికారులు ఆయనకు వివరించారు. ఈ సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేలా వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను పరిశీలించి, వాటికి ఆమోదం తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను, సహాయకులను ఉచితంగా, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీంతో పాటు, అధిక రక్తహీనతతో బాధపడే గర్భిణులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు తీసుకురావడానికి కూడా ఈ వాహనాలను వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 SUV/MUV వాహనాల ద్వారా అందించే ఈ సేవలతో ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande