
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)
కేరళ రాష్ట్ర వర్ఫ్ బోర్డు ఎటువంటి
కీలక విధానపరమైన (పాలసీ) నిర్ణయాలు తీసుకోకూడదని, క్యాపిటల్ వ్యయం చేయకూడదని కేరళ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. కేరళ వర్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, హైకోర్టు విధించిన ఈ నిరోధాలను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. వర్ఫ్ బోర్డు రోజువారీ, ప్రాథమిక విధులను అడ్డుకునేలా ఉన్న ఆంక్షల అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీంతోపాటు, బోర్డు కార్యకలాపాలన్నీ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ నిశిత పర్యవేక్షణలోనే సాగాలంటూ హైకోర్టు ఇచ్చిన నిబంధనను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. జాయింట్ సెక్రటరీ ఇప్పటికే బోర్డు సభ్యునిగా ఉన్నందున ఆయన తన పాత హోదాలోనే కొనసాగుతారని వెల్లడించింది. ఈ పిటిషన్పై కేరళ హైకోర్టు తదుపరి విచారణ జరపాల్సి ఉన్నందున, రెండు పక్షాలకు తగిన సమయమిచ్చి అఫిడవిట్లను స్వీకరించిన అనంతరం కేసును వేగంగా ముగించాలని కేరళ హైకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు