ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీజేపీ పార్లమెంట్ మార్చ్లో హింస.. గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీజేపీ పార్లమెంట్ మార్చ్లో హింస.. గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు
cpj


న్యూఢిల్లీ [ఇండియా], 21 జూలై (హి.స.): నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర హింసాత్మకంగా మారడంతో, కన్నాట్ ప్లేస్ మరియు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. జంతర్ మంతర్ వద్ద సోమవారం జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు తీవ్ర అగ్రెసివ్‌గా ప్రవర్తించారని, పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్‌లోని రీగల్ సినిమా సమీపంలో పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులపైకి రాళ్లు రువ్వినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల జాకెట్లు, హెల్మెట్లను లాక్కున్నందుకు గాను భారతీయ న్యాయ సంహిత (BNS) కింద అల్లర్ల కేసులు నమోదు చేశారు.

ఈ ఘర్షణల్లో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, డీసీపీ ర్యాంక్ సీనియర్ అధికారులు మరియు మహిళా పోలీసులతో సహా మొత్తం 118 మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. తోపులాటలో దాదాపు 60 మంది నిరసనకారులు కూడా గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడటానికి ప్రజలంతా సహకరించాలని, సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనాధికారిక పుకార్లను నమ్మవద్దని ఢిల్లీ పోలీసులు 'X' వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు మరియు డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande