
న్యూఢిల్లీ, 28 జూలై (హి.స)
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం పట్ల నేషనల్ హ్యూమనట్ రైట్స్ కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లాఠీచార్జ్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ అందజేయాలని సంబంధింత అధికారులను ఆదేశించిది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..