లోక్సభలో ‘వందేమాతరం' బిల్లు పాస్.. ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం
లోక్సభలో ‘వందేమాతరం' బిల్లు పాస్.. ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం
Vande Mataram


న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.)

విపక్షాల ఆందోళనలు, గందరగోళం

నడుమ ఆయా పార్టీల నేతల సుధీర్ఘ ప్రసంగాల అనంతరం జాతీయ గేయం వందేమాతరంపై బిల్లు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971'లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ వందేమాతరం బిల్లును ఇప్పటికే రాజ్యసభ కూడా ఆమోదించిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande