
అమరావతి, 18 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి చెన్నైలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ రిసార్ట్లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' (Southern Zonal Council) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ