
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డే 2026 వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు మరియు పరిశోధనా సంస్థలలో విద్యార్థుల కోసం ప్రత్యేక సైన్స్ ప్రదర్శనలు, అంతరిక్ష క్విజ్ పోటీలు మరియు సెమినార్లను ఏర్పాటు చేశారు. యువతలో సైన్స్ మరియు అంతరిక్ష సాంకేతికతపై ఆసక్తిని పెంచేందుకు ఇస్రో సరికొత్త డిజిటల్ ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చింది. చంద్రుడిపై భారత్ సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక మైలురాయిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi