
న్యూఢిల్లీ23 ఆగస్టు (హి.స.)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్' ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక కీలకమైన అప్డేట్ను ప్రకటించింది. గగన్యాన్ కార్యక్రమానికి చెందిన మొట్టమొదటి అన్క్రీడ్ (మనుషులు లేని) ప్రయోగాన్ని రాబోయే నాలుగు నెలల్లోనే చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ స్పష్టం చేశారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశపు అంతరిక్ష అవసరాలు మరియు భద్రతా వ్యూహాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ క్రమంలోనే గగన్యాన్ ప్రయోగానికి సంబంధించిన అన్ని రకాల సాంకేతిక పరీక్షలను ఇస్రో శాస్త్రవేత్తలు శరవేగంగా పూర్తి చేస్తున్నారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi