
శ్రీహరికోట, 25 ఆగస్టు (హి.స.)
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) నలుగురు వ్యోమగాములను మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ (SpaceX) డ్రాగన్ అంతరిక్ష నౌక నిన్న అర్ధరాత్రి విజయవంతంగా డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ మిషన్లో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి కూడా ఉండటం విశేషం. భూమి నుండి బయలుదేరిన 30 గంటల తర్వాత ఈ నౌక ఐఎస్ఎస్ను చేరుకుంది. వీరు రాబోయే ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉండి మానవ శరీరంపై సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల ప్రభావం, మైక్రోగ్రావిటీలో సరికొత్త వైజ్ఞానిక ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగ పురోగతిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు కూడా నిశితంగా గమనిస్తున్నారు.
'
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi