
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) జాతీయ వైద్య పరీక్షల బోర్డు (ఎన్బీఈఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పీజీ-2026 పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఒకే షిఫ్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. 7 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్