తిరుపతి,11 అక్టోబర్ (హి.స.)జిల్లాలోని చంద్రగిరి మండలం యల్లంపల్లిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. పంట పొలాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. 7 పెద్ద ఏనుగులు, 2 చిన్న ఏనుగుల గుంపు గ్రామ పరిసరాల్లోకి చొరబడింది. అర్ధరాత్రి ఏనుగుల భీకర శబ్దాలతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైతులు పండించిన వరి పంట, గడ్డివాము,ఫెన్సింగ్ కూసాలు, నీటి పైపులను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసాయి. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం నుంచి యల్లంపల్లికి గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ