తిరుమల, 11 అక్టోబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు(శనివారం) శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనానికి భక్తులు క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరి ఉన్నారు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 74,468 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV