పంజాగుట్టలో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి..
హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) నగరంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారంగా ఆదివారం ఉదయం సుమారు 5.30 సమయంలో గ్రీన్ల్యాండ్స్
రోడ్ యాక్సిడెంట్


హైదరాబాద్, 12 అక్టోబర్ (హి.స.) నగరంలో తెల్లవారుజామున ఘోర

రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారంగా ఆదివారం ఉదయం సుమారు 5.30 సమయంలో గ్రీన్ల్యాండ్స్ నుంచి బేగంపేట్ వైపు వెళ్తున్న 16 టైర్ల (TS09UD9279) ఇసుక లారీ ద్విచక్ర వాహనం హోండా యాక్టివా (TG04C7248)ను ఢీకొన్న ప్రమాదంలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సవారీ చేసిన వ్యక్తి తీవ్ర గాయాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను ముద్దంగల్ నవీన్(30),వృత్తి రాపిడో డ్రైవర్, నివాసం జేఎన్టీయూ, హైదరాబాద్, స్వస్థలం ఖమ్మం జిల్లా హవేలి రూరల్గా గుర్తించారు. అలాగే డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర(35), వృత్తి జనరల్ ఫిజీషియన్, కిమ్స్-సన్లైన్ ఆసుపత్రి, నివాసం మేతడిస్ట్ కాలనీ, కుండన్బాగ్, బేగంపేట్, స్వస్థలం ధర్మపురి, కరీంనగర్ జిల్లాగా పోలీసులు గుర్తించారు. ఇక లారీ డ్రైవర్ పసుపుల శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande