విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.)
: ఐపీఎస్ సంజయ్ కుమార్కు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో గతంలో సంజయ్పై కేసు నమోదైంది. సంజయ్ అగ్నిమాపకశాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసినప్పుడు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. (
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ