కర్నూలు, 16 అక్టోబర్ (హి.స.) కర్నూలులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభ వేదిక నుంచి ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులను వర్చువలుగా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
శంకుస్థాపనలు:
విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ - రూ. 2886 కోట్లు
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ - రూ. 4922 కోట్లు
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ - రూ. 184 కోట్లు
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు
ప్రారంభోత్సవాలు:
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు
కనిగిరి బైపాస్ రోడ్ - రూ. 70 కోట్లు
గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు – రూ. 13 కోట్లు
పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్ - రూ. 593 కోట్లు
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ – రూ. 200 కోట్లు
జాతికి అంకితం:
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు– రూ. 546 కోట్లు
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్లైన్ - రూ. 1730 కోట్లు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV