ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో ఆజం జాహీ మిల్లు మూత: కేటీఆర్
హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఆజం జాహీ మిల్లు మూతపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆజం జాహీ మిల్లు ఒకప్పుడు 10 వేల మంది ఉపాధి కల్పించిందని తెలిపారు. 2014 నుంచి 2
కేటీఆర్


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.) సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఆజం జాహీ మిల్లు మూతపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆజం జాహీ మిల్లు ఒకప్పుడు 10 వేల మంది ఉపాధి కల్పించిందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని, మన బిడ్డలకు కొలువులు దొరకాలని కేసీఆర్ తపించారని, ఆ తపనతోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడుపడ్డ బీజం క్రమక్రమంగా ఎదిగివస్తూ వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande