హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరాంకు అందజేశారు. నవీన్ యాదవ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..