తిరుమల,, 17 అక్టోబర్ (హి.స.)తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు కొండకు తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారు ఎంత ఫేమస్సో... శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. శ్రీనివాసుడిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు భక్తులు. అయితే గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తిరుమల లడ్డూను పెంచేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీవారి ధరల పెంపు ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ... ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ