పండక్కి ఊరెళ్తున్నారా?... ప్రైవేట్ బస్సుల్లో బాదుడే బాదుడు!
విజయవాడ, 17 అక్టోబర్ (హి.స.)దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పెరిగిన రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. దీంతో ప్రయాణికు
పండక్కి ఊరెళ్తున్నారా?... ప్రైవేట్ బస్సుల్లో బాదుడే బాదుడు!


విజయవాడ, 17 అక్టోబర్ (హి.స.)దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పెరిగిన రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సాధారణ రోజుల్లో రూ. 500 ఉండే టికెట్ ధరను ఇప్పుడు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలా దోపిడీకి పాల్పడుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. పెరిగిన ధరలతో పండుగ పూట జేబులకు చిల్లు పడుతోందని వాపోతున్నారు.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు (టీజీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించాయి. పండుగ రద్దీని తగ్గించేందుకు ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande