అమరావతి, 18 అక్టోబర్ (హి.స.)
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు.. సీహెచ్ కావ్య, కె.శరత్కుమార్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ప్యాడ్గా గ్రీన్ఫీల్డ్ క్యాంపస్లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ