హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ)రాష్ట్రాల్లో భారీ వర్షాలు)పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ