తెలంగాణ, రామగుండం. 2 అక్టోబర్ (హి.స.)
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన
సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గాంధీ జయంతి వేడుకలను గురువారం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ అహింసే ఆయుధం.. అందరికి ఆదర్శం మహాత్ముని జీవితమని వెల్లడించారు. అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు