గోదావరిఖని, 20 అక్టోబర్ (హి.స.)
గోదావరిఖని పట్టణంలో దీపావళి సందర్భంగా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు పరిశ్రమ యాజమాన్యం పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించింది. ఆదివారం రాత్రి స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ వేడుకలకు వేదికైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బుల్లితెర అగ్రతారాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రామగుండం శాసన సభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బుల్లితెర తారలు పెద్ద ఎత్తున సందడి చేశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హాస్య నటుడు అలీ, నటులు శివారెడ్డి,సాగర్, గీతా మాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్, రచ్చ రవి వంటి ప్రముఖ బుల్లితెర తారలు హాస్యాన్ని, సందడిని పండించారు. రాత్రి 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులలో జోష్ నింపాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..