కానిస్టేబుల్ను హత్య చేసిన షేక్ రియాజ్ మృతి
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో.. కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన రియాజ్
షేక్ రియాజ్


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా

మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో.. కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన రియాజ్.. అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే రౌడీషీటర్ రియాజ్

ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్ ను పట్టుకునేందుకు ఓ యవుకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షన చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకొని నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్ నాలుగు రకాల ఎక్సరేలు తీసినట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande