నిర్మల్, 20 అక్టోబర్ (హి.స.)
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి(మహోర్) రేణుక మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్దమైంది. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని గతంలో అసెంబ్లీలో ప్రస్తావించి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం కలిశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఎన్.ఈచ్ -161 బి. బి భైంసా నుండి కుబీర్ ఎన్.ఏచ్-161 ఏ హిమయత్ నగర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ రెండు రహదారుల అనుసంధానం తో టూరిజం అభివృద్ధి చెందుతూ.. భక్తులు రెండు ప్రాంతాలను సందర్శించవచ్చు. రూట్ మ్యాప్ సిద్ధం చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు